న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్లు చేసిన షర్జీల్ ఉస్మానీపై ముంబై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయగా ఢిల్లీ పోలీసులు శనివారం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానీ అభ్యంతరకర ట్వీట్లు చేశారని బీజేపీ నేత ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. రాజస్థాన్ లో ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఉస్మానీ చేసిన అభ్యంతరకర ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.
ఉస్మానీ ట్విటర్ లో శ్రీరాముడిపై అమర్యాదకరమైన పదజాలం వాడారని హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్త అంబదాస్ ఫిర్యాదు చేయడంతో గతంలో ముంబై పోలీసులు కేసు అత డిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఏడాది జనవరి 30న పుణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ సదస్సులో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలతో పుణే పోలీసులు ఉస్మానీపై కేసు నమోదు చేశారు.