కామారెడ్డి : జిల్లాలోని మద్నూర్ మండలం మొఘ గ్రామ శివారులో కారు బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణానికి చెందిన గిరీశ్ (25) తన ముగ్గురు మిత్రులతో కలిసి గురువారం కారులో బాన్సువాడ మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్నూర్ మండలం మొఘ గ్రామ శివారులో డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గిరీశ్ మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన