కామారెడ్డి: జిల్లాలోని ఉగ్రవాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉగ్రవాయి శివారులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని కృష్ణగౌడ్ (38)గా గుర్తించారు. బాధితులు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్పల్లి వాసులని వెల్లడించారు. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి