రాయ్పూర్: లంచం తీసుకుంటూ కెమేరాకు చిక్కిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఛత్తీస్గఢ్లోని మహాసముండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని సంబంధిత వ్యక్తికి ఇచ్చేందుకు ఇద్దరు పోలీసులు ఈ నెల 15న లంచం డిమాండ్ చేసి ఆ మేరకు డబ్బులు తీసుకున్నారు. అయితే దీనిని రహస్యంగా వీడియో తీసిన వాహనం వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు తుమ్గావ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) శరద్ తామ్రకర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) విజేంద్ర చందానిహాను శుక్రవారం సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని, ఆ ఇద్దరు పోలీసుల అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రఫుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.