సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం గ్రామంలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది. అంతమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే హతమార్చారు. ఇంట్లో పనిచేసే వారే డబ్బు, నగల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటుండటంతో ఘాతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.