కాచిగూడ,సెప్టెంబర్ 2 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హయత్నగర్, బృందావన్ కాలనీకి చెందిన రామయ్య కుమారుడు వి.ముత్యాలు(72) గురువారం సాయంత్రం మలక్పేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.