హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక క్రిస్టియన్ కాలనీలో ఓ వృద్ధ జంట ఇంట్లో ఉరివేసుకుని తనువులు చాలించింది. మృతులను మోహన్రెడ్డి, అనంతలక్ష్మిగా గుర్తించారు. మోహన్రెడ్డి ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వృద్ధ దంపతులు మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఇంట్లోకి ఎవరూ వెళ్లకపోవడంతో సమాచారం బయటకు తెలియలేదన్నారు. మృతుల కుటుంబ వివరాలు, ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.