మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్ కూతురు లావణ్య (21) ఎన్నారం గ్రామానికి చెందిన గోవర్ధన్తో కొన్ని సంవత్సరాల క్రితం వివహం జరిగింది. నాలుగు నెలల క్రితం గోవర్ధన్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. లావణ్య అప్పటి నుంచి మర్పల్లి తల్లిగారి ఇంటివద్దనే ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరేసుకోని ఆత్మ హత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కిందికి దించి చూసే సరికి లావణ్య అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలు అన్న నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు.