రామంతాపూర్, జూలై 7 : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతిని ముందుకు తీసుకుపోతామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం రామంతాపూర్లోని ఇందిరానగర్ చిన్న చెరువులో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి , మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూలై 10వ తేదీ వరకు సాగే పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, ఉప్పల్ మాజీ కార్పొరేటర్ అనలా హనుమంతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం కార్పొరేటర్ బండారు శ్రీవాణి ఆధ్వర్యంలో బాలకృష్ణానగర్, సాయికృష్ణాకాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ అరుణకుమారి, ఈఈ నాగేందర్, డీఈలు చందన, నాగమణి, ఏఈ విఘ్నేశ్వరి, జాన్ షరీఫ్, శ్రీధర్రెడ్డి, కిషన్, కఠారియా, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
చర్లపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. బుధవారం సీపెట్ సంస్థలో గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు విద్యార్థులు, సీపెట్ సంస్థ ప్రతినిధులు కృషి చేయాలన్నారు. పారిశ్రామికవాడలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల వెంబడి మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం సీపెట్ సంస్థ ప్రిన్సిపాల్, డైరెక్టర్ హెడ్ డాక్టర్, శ్రీనివాసులు, టెక్నికల్ డైరెక్టర్ కిరణ్కుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్చార్జి ఏకే. రావు, గోవింద్, శ్యామ్, జేసీ.రెడ్డి, నాయకులు ప్రభాకర్రెడ్డి, పద్మారెడ్డి, డప్పు గిరిబాబు, జాన్రెడ్డి, సుధాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ : పట్టణ ప్రగతిలో భాగంగా చిలుకానగర్ డివిజన్లోని సాయిరాంనగర్, మహారాజా ఎన్క్లేవ్, గణేశ్నగర్ కాలనీల్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీటి, వీధి దీపాలు, రోడ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ రాజ్కుమార్, సుదర్శన్, మల్లేశ్, సత్యనారాయణ, అజయ్, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కొండల్రెడ్డి, వీబీ.నర్సింహ, రవీందర్రెడ్డి, మహేందర్, జగన్, శ్రీనివాస్, ప్రవీణ్, యాదగిరి, శ్రీకాంత్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి : పెద్ద చర్లపల్లి ఎస్సీ బస్తీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏడో రోజు చర్లపల్లి ఎస్సీ బస్తీలో ఏఈ సత్యలక్ష్మి, వాటర్ వర్క్స్ ఏఈ స్రవంతితో కలిసి ఆమె పర్యటించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు మొక్కలు నాటి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావు, నాయకులు హరినాథ్, ప్రభుగౌడ్, కొమ్ము రమేశ్, సురేశ్, నరేశ్, భాను, బొందయ్య, ధనుంజయ్య, మురళి, రాజు, శ్రీకాంత్యాదవ్, నర్సిరెడ్డి, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా: పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం కాప్రాలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం కాప్రా ఈద్గా సమీపంలోని పార్కు స్థలంలో కాప్రా వార్డు కార్యాలయం నిర్మాణం కోసం స్థలం చదును చేశారు. వార్డు ఆఫీసు భవనం, ప్రైమరీ హాస్పిటల్ , మహిళా భవనం నిర్మాణం కోసం సర్వే నంబర్ 510లో కాప్రా తాసీల్దార్ గౌతమ్కుమార్ సూచన మేరకు స్థలం చదును చేశామని, జోనల్ కమిషనర్ నిర్మాణాలకు సంబంధించిన నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈఈ బాలకృష్ణ, ఏఈఈ అభిషేక్, జలమండలి ఏఈ రోహిత్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఉప్పల్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తున్నామని నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం నాచారం డివిజన్లోని సరస్వతీనగర్కాలనీలో కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై చెత్త పూర్తిగా తొలగింపజేశారు. పరిసరాలను శుభ్రం చేయించి, ముగ్గులు వేయించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ, చెత్త, నీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్నగౌడ్, జవాన్ కృష్ణ, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా హబ్సిగూడ డివిజన్లోని స్ట్రీట్ నంబర్ 5, 6, 7లో బుధవారం కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్ పర్యటించారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కీర్తి, కాలనీవాసులు, నేతలు సంజయ్ పటేల్, కైలాసపతి, రంగా రవి, పాశం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: హెచ్బీకాలనీ డివిజన్ ఫస్ట్ఫేజ్ మైదానం కాలనీలో కార్పొరేటర్ ప్రభుదాస్ అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని, మొక్కలు నాటారు. మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ కోటేశ్వర్రావు, డీఈఈ భాస్కర్, జలమండలి మేనేజర్ వేణుగోపాల్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి పాల్గొన్నారు.