లక్నో: అమెరికా పౌరులను మోసగిస్తున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఒక నకిలీ కాల్ సెంటర్ను పోలీసులు గుర్తించారు. ఆ కార్యాలయంపై గురువారం రైడ్ చేశారు. ఇమిగ్రేషన్, పన్నులు, బీమా సంస్థల అధికారుల పేరుతో అమెరికా పౌరులతో ఫోన్లో మాట్లాడి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 32 మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు. సుమారు 50 డెస్క్టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ నోయిడా అదనపు డీసీపీ అంకుర్ అగర్వాల్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.