హైదరాబాద్ : పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ శీవగంగ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట అడుతున్నారన్న పక్క సమాచారంతో ఎస్వోటీ పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. సంఘటనా స్థలం నుండి రూ. 65 వేల నగదు,10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.