నెల కిందటే పెండ్లి.. భార్యకు ఉరివేసి చంపిన భర్త

ముంబై: వాళ్లిద్దరూ నెల కిందటే పెండ్లి చేసుకున్నారు. పెండ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు మరింత ముదిరి భార్యకు భర్త ఉరివేసి చంపేదాకా వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ ఏరియా తులింజ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్ జిల్లాకు చెందిన 24 ఏండ్ల యువకుడు స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత డిసెంబర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. అయితే, పెండ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో భర్త భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు.
మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా