అనుమానంతో భార్యను, అడ్డొచ్చినందుకు అత్తను..
బొల్లారం, ఏప్రిల్ 11 : అనుమానం పెనుభూతమైంది.. కట్టుకున్న భార్య, ఆమె తల్లి హత్యకు దారితీసింది.. సంగారెడ్డి జిల్లా బొల్లారం పరిధిలోని గాంధీనగర్లో దారుణం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గాంధీనగర్కు చెందిన ఎల్లమ్మ(55) ఆమె కూతురు స్వరూప(32)ను గుమ్మడిదల మండ లం అన్నారం గ్రామానికి చెందిన నూనె నరసింహకి ఇచ్చి పదేండ్ల క్రితం వివాహం చేసింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పిల్లలతో కలిసి స్వరూప తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటున్నది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం, కోపం పెంచుకున్న నరసింహ ఆదివారం తెల్లవారుజామున గాంధీనగర్కు వచ్చి భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన అత్తను కూడా దారుణంగా హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఎల్లమ్మ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.