కూలీ గొంతును 9 సార్లు కోశారు..

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. పుదుపేటలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ కూలీని ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కన్నాగి నగర్కు చెందిన సంతోష్ అనే కూలీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను ఓ ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం అందులో ఒకరు సంతోష్ గొంతును బ్లేడ్తో కోసేశాడు. దీంతో సంతోష్ కింద పడిపోయాడు. మరో వ్యక్తి అదే బ్లేడుతో సుమారు 9 సార్లు సంతోష్ గొంతును కోశాడు. సంతోష్ ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ్నుంచి ముగ్గురు పరారీ అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- గీతా గోపీనాథ్పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్యలు! నెటిజన్ల ట్రోల్స్
- ఇలా చేస్తే మీ వాట్సాప్ భద్రం..!
- తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా పట్లొల్ల మోహన్ రెడ్ది
- 28 నుంచి మణుగూర్-సికింద్రాబాద్ మధ్య రైలు కూత!
- మరోసారి రుజువైన సింప్సన్ జోస్యం!
- 2,779 కరోనా కేసులు.. 50 మరణాలు
- అందుకే నో చెప్పిన సింగర్ సునీత
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ బడుగుల
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్