బషీరాబాద్ : ఓ వ్యక్తిని హత్య చేసి నిప్పు పెట్టిన ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గ్రామం నవాంద్గి శివారులో మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. వెంటనే తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలందర్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వారు క్లూస్టీంతో ఘటన స్థలానికి చేరుకున్నారు.
సీఐ జలందర్రెడ్డి, ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఇద్దరు కలిసి కర్ణాటక రాష్ట్రం నిడుగుందాకు వెళ్లి అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో హత్య సమాచారాన్ని కర్ణాటక పోలీసులకు తెలియజేశారు. మృతుడిని హత్య చేసి నిప్పు పెట్టి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.