భువనగిరి అర్బన్, జూన్ 15: బస్వాపురం గ్రామంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన ఎల్వోసీ చెక్కులను ఎంపీపీ నిర్మలావెంకటస్వామి మంగళవారం అందజేశారు. అదేవిధంగా బీఎన్తిమ్మాపురం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.43,000 వేల ఎల్వోసీ చెక్కును లబ్ధిదారుకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బస్వాపురం సర్పంచ్ మంజులాశ్రీశైలం, బీఎన్ తిమ్మాపురం ఎంపీటీసీ శారదాఆంజనేయులు, దర్శన్రెడ్డి, కృష్ణ, గణేశ్, భాస్కర్, సరేందర్, మం గమ్మ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు సీఎం సహాయనిధి పథ కం వరంగా మారిందని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశా ల, నాతాళ్లగూడెం గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కులను టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు మల్లేశం, వీరమల్ల బాలేశ్వర్ చేతుల మీదుగా ఆయన లబ్ధిదారులకు అం దజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రత్నయ్య, సుంకిశాల సర్పంచ్ నర్సింహ్మ, నాతాళ్లగూడెం ఎంపీటీసీ నర్సింహ్మ, సత్యనారాయణ, భాస్కర్, భిక్షపతి, శాంతికుమార్, వెంకటరమణ, వెంకటేశం, కొమురయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లిలో..
మండలంలో సీఎం సహాయనిధి నుంచి 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10 లక్షల విలువ చేసే ఎల్వోసీ చెక్కులను ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్ మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాటి సుధాకర్రెడ్డి, సీత వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.