లక్నో: ఒక నర్సు మొబైల్ ఫోన్లో మాటల్లో పడి ఒక మహిళకు రెండు కరోనా టీకాలు వేసింది. ఈ పొరపాటుకు క్షమాపణలు చెప్పకపోగా ఆ మహిళనే తప్పుపట్టింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన 50 ఏండ్ల కమలేష్ కుమారి, కరోనా టీకా తొలి డోసు కోసం గురువారం మార్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్ఎం అర్చన మొబైల్ ఫోన్లో మాటల్లో బిజీగా ఉండి ఆ మహిళకు వెంట వెంటనే రెండు కరోనా వ్యాక్సిన్లు వేసింది. రెండు ఇంజక్షన్లు ఇవ్వడాన్ని ప్రశ్నించిన ఆమెపై ఆ నర్సు మండిపడింది.
కాగా, కమలేష్ కుమారి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ఆ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి దీనిపై నిలదీసి గొడవ చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్లో బిజీగా ఉండి రెండు టీకాలు వేసిన నర్సు నిర్లక్ష్యంపై సీనియర్ అధికారులు, చీఫ్ మెడికల్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి.