అమరావతి,జూలై:మహిళా కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ తనపట్ల ఎంపీడీవో మనోహర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఎంపీడీవో ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో అందరి ముందు తనను చెప్పలేని మాటల అన్నారని భవానీ వాపోయింది. దీనిపై లేడీ కానిస్టేబుల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో ఎంపీడీఓ మనోహర్ను ఎస్సై హైమావతి స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చింది. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై మందలించింది. ఇకపై ఇలాంటివి రిపీట్ కావొద్దని గట్టిగా హెచ్చరించింది ఎస్సై. గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి మహిళను వేధించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఎంపీడీవో మనోహర్బాబు తన ఆఫీస్ స్టాఫ్, లేడీ ఫీల్డ్ అసిస్టెంట్తోనూ ఇలాగే అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.