భోపాల్: డబ్బుల విషయంపై ఒక బాలుడ్ని నలుగురు కొట్టడంతోపాటు బలవంతంగా బూట్లు నాకించి సిగరెట్ తాగించారు. దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రెండు వేలపై వివాదం నేపథ్యంలో నాయగావ్కు చెందిన 17 ఏండ్ల బాలుడ్ని గురువారం నలుగురు వ్యక్తులు సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అతడ్ని దారుణంగా కొట్టారు. అనంతరం వారి బూట్లు నాకించారు. బలవంతంగా సిగరెట్ తాగించారు. దీనిని మొబైల్లో వీడియో తీశారు.
మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతడిపై దాడి అనంతరం గురువారం రాత్రి ఇంటికి తిరిగివచ్చాడు. జరిగింది తన పేరెంట్స్కు చెప్పాడు. మరోవైపు ఆ బాలుడిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీని ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. నలుగురిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరు మైనర్లని, వీరు పరారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.