హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫ్రాన్స్ దేశస్థురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్లో చోటు చేసుకుంది. కూతురు రోమా జోసెఫ్ తల్లి మెరికను హత్య చేసి స్థానిక చెరువులో పడేసింది. ప్రియుడితో కలిసి తల్లిని దత్తత కూతురు హత్య చేసింది. రోమా జోసెఫ్తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే మెరికకు ఇద్దరు సొంత కూతుళ్లు ఉండగా, మరో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని పోషిస్తోంది. ఆస్తి కోసమే దత్తత కూతురైన రోమా.. తల్లిని చంపినట్లు తెలుస్తోంది.