ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

సూర్యాపేట : అత్తతో గొడవపడి ఓ ఇల్లాలు తన పిల్లలను తీసుకొని అదృశ్యమైన ఘటన జిల్లాలోని చివ్వెంల మండలంలోని కోమటికుంటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోగుల రాజు, శ్రీలత (27) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కాగా, ఈ నెల 21న శ్రీలత తన భర్త వద్దకు వెళ్తాను అనడంతో అత్తతో గొడవ జరిగింది. అనంతరం తన భర్త వద్దకు వెళ్తున్నాని చెప్పి తన ఇద్దరు పిల్లలను శ్రావ్య (10), రిషికేశ్ (7) తీసుకొని ఇంటి నుంచి బయటికెళ్లింది. అయితే భర్త వద్దకు శ్రీలత వెళ్లలేదు. దీంతో బంధువులు ఎన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోడంతో భర్త రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి
ఐటీ హబ్తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
తాజావార్తలు
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
- మాస్కులు లేనివారి నుండి డబ్బులు వసూలు.. నకిలీ పోలీసు అరెస్టు
- 30 రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయడమెలా..?