సాగర్ రోడ్డుపై ప్రమాదం.. తల్లీకుమారుడు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్పై వెళ్తున్న తల్లీకుమారుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల్లీకుమారుడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రాగన్నగూడ జీవీఆర్ కాలనీకి చెందిన ప్రదీప్ రెడ్డి(19), చంద్రకళ(48) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారు నంబర్ : AP29BD7111, యమహా ఫాసినో బైక్ నంబర్ : TS07GA2600
తాజావార్తలు
- అవును.. ఇండియన్ ప్లేయర్స్పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి