అబిడ్స్ : తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మహిళ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు మంగళ్హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎ రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం….గగన్పహాడ్ ప్రాంతానికి చెందిన విజయ (23) తన భర్త శంకర్తో గొడవ పెట్టుకుని తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఈ నెల 18న గుఫా నగర్లో నివసించే సోదరి లక్ష్మి ఇంటికి వచ్చింది.
22న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయ తన చిన్నకుమారుడు శ్రీకాంత్ (4)ను తీసుకుని బయటకువెళ్లి తిరిగి రాలేదు. దీంతో సోదరి లక్ష్మి ఆమె భర్త శంకర్కు సమాచారం అందించి ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో మంగళ్ హాట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.