మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో దారుణం జరిగింది. తల్లీ, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వీరిద్దరిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలతోనే అత్త విజయలక్ష్మీ, భార్య ప్రవీణను అల్లుడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో అల్లుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.