జగిత్యాల : ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన వలస జీవి మృతదేహం శనివారం స్వగ్రామం చేరింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా భూషణరావుపేటకు చెందిన తిపిరి దేవయ్య(48) కొద్దిరోజుల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ హవాజ్ కంపెనీలో క్లినింగ్ విభాగంలో పనికి కుదిరాడు.
గత నెల 30న విధులు ముగించుకొని తన గదికి చేరుకోగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు.
ఈ క్రమంలో శనివారం మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా, స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతుండడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. దేవయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది