జనగామ : కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించి ప్రజలు అపోహలు వీడాలని సూచించారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని జఫర్గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ చౌదర్పల్లి మల్లయ్య (50) కరోనా తో మృతి చెందాడు. కాగా, ఎమ్మెల్యే దగ్గరుండి మృత దేహాన్ని చితిపైకి స్వయంగా మోశారు. కరోనాతో మృతి చెందిన మృతదేహానికి వైరస్ ఉండదన్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో నిర్భయంగా పాల్గొన వచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు