షాబాద్ : కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవం లభ్యమైంది. షాబాద్ మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పాల్గుట్ట మానయ్య (38) ఈ నెల 13వ తేది నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల, బంధవుల, స్నేహితుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో అతడి తండ్రి అనంతయ్య ఈ నెల 24న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం అచ్చంపేట్ అడవుల్లో ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో పోలీసులు మానయ్యగా గుర్తించారు. పోలీసుల విచారణలో మానయ్య భార్యపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాబాద్కు చెందిన ఓ వ్యక్తితో మృతుడి భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న భర్తను హత్యచేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.