పర్ణశాల : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని చిన్నబండిరేవులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన జయమంగళ బాబూరావు తన భార్యపిల్లలతో 20ఏండ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ప్రతి ఏడాది జనవరిలో చేపలవేట కోసం మండల పరిధిలోని చిన్నబండిరేవులో తన కుమార్తె రజని దగ్గరకు వచ్చిపోతుంటాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది బాబూరావు తన కుమార్తె రజని, అల్లుడు వెంకన్నబాబుతో వచ్చాడు. కొన్ని ఏండ్లుగా బాబూరావు మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. జూలై 4న తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి అప్పటి నుంచి కనిపించడంలేదు. రెండు నెలలుగా వెతుకుతున్నా కనిపించకపోవడంతో స్టేషన్లో ఫిర్యాదు చేయగా కుమార్తె రజని ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.