జనగామ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. కొడకండ్ల మండలం వెలిశాల శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ లోంచి కేజ్ వీల్స్ ఒక్కసారిగా కింద పడిపోయి మంత్రి కాన్వాయిలోని బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, శుక్రవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తి దారుల సహకార సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్