లక్నో : యూపీ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 14 ఏండ్ల బాలికను హింసించి ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. లక్నోలోని ఇంతౌజా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ దారుణం జరిగింది. తల్లి మందలించిందనే కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికకు ఆహారం అందించి పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఈ-రిక్షా డ్రైవర్ అరాచకానికి పాల్పడ్డాడు.
బాలికను రెండు వేర్వేరు ప్రాంతాలకు తీసుకువెళ్లిన నిందితుడు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై బాలిక కోసం గాలించగా మరుసటి రోజు ఉదయం బాధితురాలిని గుర్తించారు. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 23 నుంచి 27 ఏండ్ల మధ్య వయసున్న నిందితులను ఇక్రముద్దీన్, నసీం, షకీల్, నూర్ మహ్మద్, ఉత్తం శర్మ, రితేష్ యాదవ్ లుగా గుర్తించారు.