భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఒక మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన బీజేపీ నేత సభ్వత్వాన్ని ఆ పార్టీ రద్దు చేసింది. మహిళ ఒక బాలికను ఆగ్రా నుంచి భోపాల్కు తీసుకువచ్చింది. ఆ బాలికను హోటల్కు తీసుకెళ్లి ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు, హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డిండోరిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు భోపాల్ ఎస్పీ సాయి కృష్ణ తోట తెలిపారు.
కాగా, నిందితుల్లో ఒకరైన దిండోరి బీజేపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మనీష్ నాయక్ ప్రాథమిక సభత్వాన్ని రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు అరెస్టైన వారిలో మరొకరు జేడీయూ కార్యకర్త దినేష్ అవధియాగా గుర్తించారు.