వికారాబాద్ : యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. జర్నలిస్ట్ గా అతి చిన్న వయసులో అనేక ప్రజలకు ఉపయోగపడే కథనాలతో అందరిలో తనదైన ముద్ర వేసిన రవీందర్ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.
వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణవార్త తెలిసిన వెంటనే రవీందర్ భార్య లావణ్యతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. వికారాబాద్ జిల్లా నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి