కొత్తగూడెం క్రైం : మావోయిస్టు పార్టీకి చెందిన 14మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భగా ఎస్పీ సునీల్ దత్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నిషేధిత మావోయిస్టు పార్టీ చర్ల మండలం ఎర్రంపాడు, రాళ్లపురం, రామచంద్రాపురం, కిష్టారంపాడు, కొరకట్ పాడు గ్రామాలకు చెందిన ఒక బాలికతో సహా 14మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేసినట్లు ఆయన వివరించారు.
ఇటీవల కాలంలో వీరిని మావోయిస్టు నాయకులు పెసర్లపాడు, పుట్టపాడు, చందా ప్రాంతాలకు బలవంతంగా తీసుకెళ్లి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ నిత్యం మీటింగులకి రావాలని, రేషన్ పంపించాలని పెట్టే ఆంక్షలతో ఆ పార్టీ సిద్ధాంతలపై విసుగు చెందిన సదరు14మంది మిలీషియా సభ్యులు ప్రశాంత జీవనాన్ని గడిపేందుకు ముందుకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్ దత్ స్పష్టం చేశారు.
లొంగిపోయిన మిలీషియా సభ్యుల్లో ముగ్గురు మైనర్లు ఉండడం గమనార్హం. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వుప్పు తిరుపతి, భద్రాచలం ఏస్పీ వినీత్. జి, సీఆర్పీఎఫ్ 141బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద పావర్, డిప్యూటీ కమాండెంట్ సంతోష్ కుమార్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్, ఎస్సై ఆలెం రాజువర్మ, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీష్ రెడ్డి
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో