నిజాంపేట, ఏప్రిల్ 9 : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో చెర్విరాల కృష్ణమూర్తికి చెందిన సూపర్ మార్కెట్, చల్మెడ కమాన్ వద్ద దాబాను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రైతులు ఆనందంగా ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగుకు గోదావరి జలాలు రాబోతున్నాయని, దీంతో మెదక్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 350 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పారంభించనున్నట్లు తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధి రాములు, టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ సంపత్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తిరుమల స్వామి ఆలయ చైర్మన్ మహేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు, ఆత్మకమిటీ మెంబర్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
41 సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష