వనపర్తి : పోలీసులంటే దండించేవారు కాదు, దయాగుణం కలిగిన వారని మరోసారి నిరూపించారు మదనాపురం పోలీసులు. జిల్లాలోని మదనపురం మండల కేంద్రానికి చెందిన శకుంతల(80) అనే వృద్ధురాలికి నా అన్నవారు ఎవరూ లేరు. తనకున్న చిన్న ఇంట్లో ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నది. చుట్టుపక్కల వాళ్లు ప్రతిరోజూ శకుంతల నివాసానికి వెళ్లి భోజనం అందించేవాళ్లు. కొద్దిరోజులుగా శకుంతల అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది.
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఎవరూ కూడా అటుపక్క వెళ్లడానికి సాహసం చేయలేదు. వృద్ధురాలి దూరపు చుట్టం వరుసకు కూతూరైన లక్ష్మి అనే మహిళ బాధపడుతూ ఉండగా..విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాజి ఆపత్కాలంలో అండగా నిలిచారు.
ప్రజలకు సేవలు చేసేందుకే తామున్నామంటూ తన సిబ్బందితో కలిసి శకుంతల శవాన్ని మోసి హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
పోలీసులు చూపిన తెగువకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ తిరుపాజి, ట్రైనీ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది రవికుమార్, కుర్మయ్య గౌడ్, శివారెడ్డి, సాములు, కలాం, సీడీసీ డైరెక్టర్ బాలకృష్ణ, మనోజ్ కుమార్, జగదీష్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్