హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారు నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న బైక్లపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఐదు బైక్లు ధ్వంసం అయ్యాయి. స్థానికులు కారులోని ఇద్దరిని పట్టుకోగా మరోక వ్యక్తి పరారయ్యాడు.