అమరావతి : అతివేగంగా వచ్చిన బైకులు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం శివారులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప దవాఖానకు తరలించారు. మృతుడు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్తిస్తున్నారు.
బైకులు ఢీకొన్న వేగానికి నుజ్జునుజ్జయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.