హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని నేనున్నానంటూ ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్కు కరీంనగర్కు చెందిన చిన్నారి నబీలా కృతజ్ఞ తలు తెలిపారు. ‘హలో కేటీఆర్ సార్. దిస్ ఈజ్ నబీలా ఫ్రం కరీం నగర్. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీ సేవలకు కృత జ్ఞతలు తెలపకుండా ఉండలేకపో తున్నాం. మా కృతజ్ఞతలు అందుకోండి కేటీఆర్ సార్’ అంటున్న నబీలా వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు హైదరాబాద్లో కరీంనగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఖాజాహుస్సేన్ 20 రోజులపాటు ప్రచారం పాల్గొన్నారు. ఆ క్రమంలో ప్రచారం తీరుపై మంత్రి కేటీఆర్ పార్టీ నాయకు లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా, కరీంనగర్ కార్యకర్త ఖాజాహుస్సేన్ బిడ్డ పుట్టినరోజు ఉన్నప్పటికీ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వెంటనే మంత్రి కేటీఆర్ కరీంనగర్లోని నాయకుల ద్వారా నబీలాకు పుట్టినరోజు కానుకలు అందించారు. ‘కేటీఆర్ సార్. నా పుట్టినరోజు సందర్భంగా ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. గిప్ట్లు పంపారు’అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ నబీలా వీడియోలో మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు