బండ్లగూడ : మహిళపై సామూహిక లైంగికదాడి చేయడంతో పాటు నగదు,బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంత్రం పూరానపూల్ నుంచి అత్తాపూర్ కల్లు కంపౌండ్లో కల్లు తాగేందుకు ఓ మహిళ (35) వచ్చింది.
అక్కడే కల్లు తాగుతున్నఓ అటో డ్రైవర్ అతని స్నేహితులతో కలిసి అమెతో మాటలు కలిపారు. అనంతరం ఇంటి వద్ద వదులుతామని చెప్పడంతో అమె వారి అటోలో వెళ్లింది. కాగా వారు అమెను హిమాయత్ సాగర్ వద్ద ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అమె పై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. అంతే కాకుండా మహిళ మెడలోంచి పుస్తేలతాడు, కొంత నగదును ఎత్తుకెళ్లారు.
అర్దరాత్రి సదరు మహిళ 100 నెంబర్కు పోన్ చేసి చేప్పడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అమెను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.అమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుల గురించి వేట మొదలు పెట్టినట్లు తెలిపారు.