మెహిదీపట్నం :తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….సికింద్రాబాద్ వారాసిగూడలో సయ్యద్ సజ్జాద్(25)తన భార్య షహనాజ్తో నివసిస్తున్నాడు. కొరియర్ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇదిలా ఉండగా మెహిదీపట్నం గుడిమల్కాపూర్ సాయినగర్ కాలనీలో నివసించే సయ్యద్ ఎజాజ్ (35) కారుడ్రైవర్గా పనిచేస్తూ జీవించేవాడు. ఇతడు సజ్జాద్ భార్య షహనాజ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఎజాజ్ ఇంట్లో ఉండగా సజ్జాద్ ఆ ఇంట్లోకి చొరబడి కత్తితో ఎజాజ్పై దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.