తాండూరు రూరల్ : కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరణ్కోట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఏడు కొండలు తెలిపిన వివరాలు ప్రకారం.. తాండూరు మండలం, గుండ్లమడుగుతండాకు చెందిన అనిత (23) ఈ నెల 22న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.