లక్నో : తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదనే ఆవేదనతో వివాహితుడు ఆమె ప్రియురాలు విషం సేవించిన ఘటన యూపీలోని మొరదాబాద్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం వీరు మొరదాబాద్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధరక్ నగ్లా గ్రామానికి చెందిన రాజ్ కుమార్కు రెండేండ్ల కిందట వివాహమైంది. కుమార్ గత ఏడాది సంభాల్లోని తన మామ ఇంటికి వచ్చిన క్రమంలో మరదలితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆపై వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించలేదు.
దీంతో మంగళవారం రాత్రి కుమార్ అతడి ప్రియురాలు వారి ఇండ్ల నుంచి అదృశ్యమయ్యారు. గురువారం కుమార్ ఇంటికి వచ్చిన వారు తాము విషం సేవించామని చెప్పారు. దీంతో వారిని స్ధానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా పరిస్ధితి విషమంగా ఉండటంతో మొరదాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. కాగా కుమార్ తమ కుమార్తెను అపహరించాడని మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.