భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం చెక్పోస్టు వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.