సంగారెడ్డి : పటాన్చెరు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఓ వాహనంలో తరలిస్తున్న 280 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా – ఒడిశా సరిహద్దు నుంచి జహీరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.