ఊర్కొండ, జూన్ 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొమ్మరాసిపల్లి గ్రామంలో ప్రకృతి వనం, డంపింగ్యార్డ్, వైకుంఠధామంతోపాటు ఊర్కొండపేటలో రైతువేదిక భవనాలను ఆయన ప్రా రంభించారు. అనంతరం ఊర్కొండలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతును పట్టించుకున్న నాయకుడే లేడన్నారు. ప్రతి రైతు అభివృద్ధే ధ్యేయంగా దేశంలో పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్తోపాటు రైతు అభ్యున్నతికి రైతుబంధు, రైతుబీమాతోపాటు పింఛన్లు అందజేస్తున్నారని గుర్తు చేశారు.
పల్లెప్రకృతి వనాలతో గ్రామాలను పచ్చగా మార్చినట్లు, పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయన్నారు. మిషన్ భగీరథతో నీటి ఎద్దడి తీర్చి ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా బొమ్మరాసిపల్లి గ్రామంలో అభివృద్ధికి పాటుపడిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క రాధజంగయ్య, వైస్ ఎంపీపీ, అరుణ్కుమార్రెడ్డి, జెడ్పీటీసీ శాంతకుమారి రవీందర్, కోఆప్షన్ ఖలీంపాషా, సర్పంచులు లక్ష్మమ్మ అంజయ్య, కవితా మణిపాల్రెడ్డి, ఆనితా నాగోజీ, రాజయ్య, శివరాణి హరీష్, అనిల్రెడ్డి, ఆంజనేయులు, ఎంపీటీసీ గోపాల్గుప్తా, ఈశ్వరమ్మతోపాటు ఉప సర్పంచ్, రాధిక, బుచ్చమ్మ, నారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరినాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపాల్రెడ్డి, జనార్దన్రెడ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి, సుజీవన్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, విజయ్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులుతోపాటు నాయకులు పాల్గొన్నారు.