చెన్నై : తన కూతురు వెంటపడి వేధిస్తున్న యువకుడిని అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో జరిగింది. మరణించిన యువకుడిని 22 ఏండ్ల రాజేష్ గా గుర్తించారు. రాజేష్ గత కొంత కాలంగా నిందితుడి కుమార్తె (16)ను వేధింపులకు గురిచేస్తున్నాడు.
తనను ప్రేమించాలని ఒత్తిడి తీసుకువస్తుండటంతో బాలిక తండ్రి పలుమార్లు అతడిని హెచ్చరించాడు. మంగళవారం సాయంత్రం బాలిక కిరాణా షాపునకు వెళ్లివస్తుండగా యువకుడు అడ్డగించి తనను ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు రాజేష్ ను నడివీధిలో ఇనుప రాడ్ తో చితకబాదాడు. తీవ్ర గాయాలతో రాజేష్ మరణించాడు.