సత్తుపల్లి : తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సదాశివునిపాలెంలో చోటుచేసుకుంది. సదాశివునిపాలెంకు చెందిన దుబ్బాక ధన్యతేజ(27) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. దీంతో అతని తండ్రి చందు మందలించగా మనస్థాపానికి గురైన ధన్యతేజ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధన్యతేజకు భార్య సుప్రియ, కుమారుడు ఉన్నారు. తండ్రి చందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.