ముంబై: దగ్గరగా మూత్రం పోయవద్దన్నందుకు ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. వదలా ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేకు సమీపంలోని బాగ్లా గార్డెన్లో 41 ఏండ్ల మొహమ్మద్ రఫీక్ అన్సారీ, మరో వ్యక్తి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో 24 ఏండ్ల మొహమ్మద్ అబ్దుల్లా ఆలం షేక్ అక్కడకు వచ్చి వారికి దగ్గరగా మూత్రం పోస్తున్నాడు. దీంతో కాస్త దూరంగా మూత్ర విసర్జన చేయాలని అన్నారీ చెప్పాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన షేక్ కత్తితో అన్నారీని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
అన్నారీని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. అన్సారీని హత్య చేసిన నిందితుడు షేక్ను వదలా ట్రక్ టెర్మినల్ స్టేషన్ పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.