న్యూఢిల్లీ: పుట్టిన రోజు వేడుకల్లో డీజే సాంగ్స్ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణ తుపాకీ కాల్పులకు దారి తీయగా ఒకరు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నజాఫ్గఢ్ ప్రాంతంలోని ఫామ్హౌస్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డీజే సాంగ్స్తో హంగామా చేశారు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి సోదరుడు అంజు శర్మ, నవీన్ అనే వ్యక్తి మధ్య దీనిపై ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన నవీన్ తన వద్ద ఉన్న తుపాకీతో అంజుపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడిన అంజు శర్మను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు నవీన్ను గుర్తించారు. బాబా హరిదాస్ నగర్లో ఉన్న అతడ్ని శనివారం అరెస్ట్ చేశారు. నవీన్ అక్రమంగా కలిగి ఉన్న తుపాకీ, గుండ్లను స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.