కట్నం కోసం కాల్చి చంపాడు!

లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపాడు. ముజఫర్నగర్ జిల్లాలోని ఖటౌలి పట్టణంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖష్నుమా (35), ఫిరోజ్ ఇద్దరూ భార్యాభర్తలు. పదేండ్ల క్రితం వారి వివాహం జరుగింది. వారి ఇద్దరు పిల్లలున్నారు. గత కొన్నేండ్లుగా వీరి కుటుంబం ఖటౌలి పట్టణంలో నివాసం ఉంటోంది. అయితే పెండ్లి జరిగినప్పటి నుంచి ఆరిఫ్ ఖుష్నుమాను కట్నం కోసం వేధించేవాడు. రోజులు గడుస్తున్నా కొద్ది అతని వేధింపులు పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే ఇవాళ (ఆదివారం) కూడా భార్యాభర్తల మధ్య కట్నం గురించి గొడవ జరిగింది. అయితే మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో ఆరిఫ్ తుపాకీతో ఖుష్నుమాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఖుష్నుమా అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే ఆరిఫ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖుష్నుమా మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. పరారీలో ఉన్న ఆరిఫ్ కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- యాదాద్రిలో వైభవంగా న్యితకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని